మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌లో "ది బ్లాక్ బస్టర్" విభాగంలో "పుష్ప" ప్రదర్శన

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:06 IST)
హీరో అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ కె.సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం పుష్ప. గత యేడాది ఆఖరులో విడుదలై ఇప్పటికీ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన అవకాశాకాన్ని దక్కించుకుంది. ప్రతిష్టాత్మకంగా భావించే మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌లో బ్లాక్ బస్టర్ విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శనకు నోచుకుంది. తద్వారా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. 
 
తిరుపతి శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. కరోనా రెండో దశ అల తర్వా విడుదైంది. సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రీమియర్ కాబడిన తర్వాత 'పుష్ప' సినిమా రీచ్ మరింత పెరిగింది. "తగ్గేదేలే" అంటూ బన్నీ పలికిన డైలాగులు, పుష్పరాజ్‌గా అతని మేనరిజమ్స్ గట్టి ప్రభావం చూపించాయి. 
 
అయితే ఇప్పుడు ప్రతిష్టాత్మక 44వ మాస్కో ఫైల్మ్ ఫెస్టివల్‌లో 'పుష్ప' పార్ట్-1ను స్క్రీనింగ్ చేశారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రపంచవ్యాప్తంగా 'బ్లాక్ బస్టర్స్' కేటగిరీ కింద ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. 
 
ఈ ట్వీట్‌ను హీరో అల్లు అర్జున్ షేర్ చేశారు. "పుష్ప - ది రైజ్ - పార్ట్ -1 చిత్రాన్ని మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ బ్లాక్ బస్టర్ హిట్స్ విభాగంలో ఎంపిక చేసినందుకు సంతోషిస్తున్నాం" అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments