బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'పుష్ప'రాజ్.. రూ.71 కోట్ల ఓపెనింగ్స్‌తో దూకుడు

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (18:04 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ కె.సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పుష్ప". ఈ నెల 17వ తేదీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే, ఈ చిత్రం ఓపెనింగ్ రోజున ఏకంగా 71 కోట్ల రూపాయల గ్రాస్‌ను రాబట్టింది. 2021 సంవత్సరంలో రిలీజైన భారతీయ చలన చిత్రాలు రాబట్టిన హయ్యస్ట్ గ్రాసర్ ఇదేనని ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ తెలిపింది. 
 
ఇకపోతే, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. పాత రికార్డులను తిరగరాస్తూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా, పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ నటనకు మరో స్థాయిలో ఉందని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. నటన పరంగా బన్నీ మరో మెట్టుకు ఎదిగారంటూ రివ్యూల్లో సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ కాగా,  పాహద్ ఫాజిల్ ఇందులో ప్రత్యేక పాత్రలో నటించారు. సంగీత బాణీలను దేవీశ్రీ ప్రసాద్ సమకూర్చారు. హీరోయిన్ సమంత ప్రత్యేక ఐటమ్ గీతంలో నర్తించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments