Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

మురళి
శనివారం, 30 నవంబరు 2024 (14:53 IST)
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కి, డిసెంబరు 5వ తేదీన విడుదలకానున్న 'పుష్ప-2' చిత్రం టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, డిసెంబరు 4వ తేదీ 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోతోపాటు అర్థరాత్రి ఒంటి గంట షోకు అనుమతి ఇచ్చింది. 
 
'పుష్ప-2' బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌లో బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800 వసూలు చేసుకోవచ్చని తెలిపింది. అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. 
 
డిసెంబరు 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంపు, డిసెంబరు 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చింది. అలాగే, డిసెంబరు 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

Mangalsutra for Love: 93 ఏళ్ల వయస్సులో భార్య కోసం మంగళసూత్రం వీడియో వైరల్

తిరుమ‌ల‌ భ‌క్తులకు గుడ్ న్యూస్: భక్తుల సౌక‌ర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments