Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

ఠాగూర్
బుధవారం, 22 జనవరి 2025 (15:49 IST)
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప-2' మూవీ. గత యేడాది డిసెంబరు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన రోజు తొలి ఆట నుంచి సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, పాత రికార్డులను తిరగరాస్తూ వస్తుంది. అయితే, ఈ చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిప్రకాష్, సుకుమార్ గృహాల్లో ఐటీ అధికారులు గత రెండు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో "పుష్ప-2" చిత్రం వసూళ్ళకు తగిన విధంగా ఆదాయపు పన్ను చెల్లించలేదని ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే, ఈ చిత్రం కోసం ఖర్చు చేసిన బడ్జెట్, వచ్చిన కలెక్షన్లు వంటి అంశాలపై దృష్టిసారించారు. 
 
ఇప్పటివరకు 'పుష్ప-2' మూవీ రూ.1700 కోట్లకుపైగా వసూలు చేసినట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్, వచ్చిన ఆదాయం ఎంతో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సుమారుగా 55 మంది ఐటీ అధికారుల బృందం ఈ తనిఖీల్లో నిమగ్నమైవున్నారు. 
 
కాగా, తొలుత ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన గృహాలు, ఆఫీసుల్లో తనిఖీలకు ప్రారంభించిన ఐటీ అధికారులు గత రెండు రోజులుగా చిత్రపరిశ్రమకు చెందిన నిర్మాతలు, ఫైనాన్షియర్లు, పంపిణీదారుల నివాసాల్లో సోదాలు చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments