Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ కాక‌పోతే ఇంకొక‌రు.. ఆ సినిమా మాత్రం ఆగ‌దు - పూరి..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం మెహ‌బూబా. ఆకాష్ పూరి, నేహాశెట్టి జంట‌గా న‌టించిన మెహ‌బూబా చిత్రం ఈనెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుక

Webdunia
సోమవారం, 7 మే 2018 (18:57 IST)
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం మెహ‌బూబా. ఆకాష్ పూరి, నేహాశెట్టి జంట‌గా న‌టించిన మెహ‌బూబా చిత్రం ఈనెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా పై బిగినింగ్ నుంచి పాజిటివ్ టాక్ ఉండ‌డం.. దీనికితోడు దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తుండ‌టంతో ఖ‌చ్చితంగా ఈ సినిమా విజ‌యం సాధిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. 
 
ఇదిలాఉంటే... ఈ చిత్రం  ప్రమోషన్లో పూరి బిజీగా ఉన్నారు. తాజాగా, మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో తాను మహేష్ బాబు హీరోగా తలపెట్టిన 'జనగణమన' చిత్రాన్ని ప్రస్తావించారు. మహేష్‌తో 'బిజినెస్ మేన్' తీసిన తరువాత 'జనగణమన' ప్లాన్ చేశానని, అయితే, మహేష్ ఏమీ తేల్చలేదని పూరీ చెప్పారు. ఈ సినిమాను మహేష్ కాక‌పోతే... మరో హీరోతో ఈ సినిమాను ఖ‌చ్చితంగా తీస్తానని అన్నారు. 
 
సమాజానికి ఇటువంటి చిత్రం ఎంతో అవసరమని, అత్యాచార ఘటనలు విన్నా, చూసినా తనకెంతో బాధకలుగుతుందన్నారు.  ఈ దేశం ఎలా పోతుందో అర్థం కావడం లేదనిపిస్తుందనీ, భారతావని సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలన్నదే 'జనగణమన' స్టోరీలైన్ అని చెప్పారు. 
 
ఈ మూవీని వెంకీతో పూరి తీయ‌నున్న‌ట్టు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి... జ‌న‌గ‌ణ‌మ‌నలో మ‌హేష్ న‌టిస్తాడా..? వెంకీ న‌టిస్తాడా..? వీరిద్ద‌రూ కాకుండా మ‌రో హీరో న‌టిస్తాడో..? తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను నిలిపివేసిన భారత్.. పాకిస్థాన్‌లో ఎండిపోతున్న డ్యామ్‌లు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments