Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బయోపిక్ తీస్తానంటున్న పూరీ జగన్నాథ్...

Webdunia
గురువారం, 30 మే 2019 (15:36 IST)
వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో అతడి బయోపిక్ తీయడానికి పలువురు పోటీ పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కొంతమంది జగన్ పేరు ఎత్తడానికి కూడా భయపడ్డారు.


అయితే మరికొంతమంది నటీనటులు మాత్రం ధైర్యంగా జగన్‌కు అండగా నిలిచారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్ అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రి కావడంతో జగన్ బయోపిక్‌కు బాగా డిమాండ్ ఏర్పడింది.
 
తాజాగా మహి వి రాఘవ యాత్ర 2 అంటూ జగన్ బయోపిక్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించగా దర్శకులు పూరి జగన్నాథ్ కూడా నేను సైతం అంటూ ముందుకు వస్తున్నాడు. పూరీ మాత్రం జగన్ బయోపిక్ నేనే తీస్తాను అంటున్నాడు. 
 
గతకొంత కాలంగా ఈ దర్శకుడికి సరైన హిట్ లేదు. దాంతో ఫామ్‌లో లేకుండా పోయాడు. తాజాగా హీరో రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. అది వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. అది సక్సెస్ అయితే జగన్ బయోపిక్ తీస్తానంటే గ్రీన్ సిగ్నల్ లభిస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి..

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments