Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భార్య, కుమారునితో దిల్ రాజు.. ఫోటోలు వైరల్

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (22:39 IST)
Dil Raju
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా, సక్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా పేరున్న దిల్ రాజు తిరుమల ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్న బడ్జెట్ సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే స్థాయికి ఇండస్ట్రీలో ఎదిగారు. 
 
తాజాగా సినిమాల విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక దిల్ రాజు వ్యక్తిత్వ జీవితం గురించి..  మొదటి భార్య అనిత 2017వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
 
అయితే ఈయన కూతురు హన్షిత రెడ్డి తన తండ్రి ఒంటరిగా ఉండడం చూడలేక తన సమీప బంధువు అమ్మాయి తేజస్విని తన తండ్రికి రెండవ వివాహం చేశారు. ఈ విధంగా తేజస్విని రెండవ వివాహం చేసుకున్న దిల్ రాజు తాజాగా జూన్ 29వ తేదీ దిల్ తేజస్విని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే తనకు వారసుడు వచ్చాడంటూ దిల్ రాజు తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
తాజాగా దిల్ రాజు తన భార్య కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం బయటపడటంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై ఆందోళనలు.. మోదీ సమీక్ష

Gujarat: భార్య వివాహేతర సంబంధంలో ఉందని ఆరోపణలు.. భరణం చెల్లించాల్సిందే..

Owaisi: పాకిస్తాన్ బుద్ధి మారాలని ప్రార్థించాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments