Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్త‌ుందా..? లేదా..?

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (18:56 IST)
సుధీర్ బాబు, నందిత రాజ్ జంటగా నటించిన చిత్రం ప్రేమకథా చిత్రమ్. ప్ర‌భాక‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా ప్రేమకథా చిత్రమ్ 2 రూపొందుతోంది. ఇందులో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హ‌రికిష‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సుద‌ర్శ‌న్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
ఈ నెల 21న‌ ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రల కాంబినేషన్లో.. హారర్ కామెడీ సీన్స్ పైన కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ .. అదేంటో తెలుసుకోవాలి.. అనే హీరో డైలాగ్ .. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదా… అనే నందిత శ్వేత డైలాగ్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
 
ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే..గాయం 2, అవును 2, శంక‌ర్ దాదా జిందాబాద్, స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్, రాజు గారి గ‌ది 2… ఇలా తెలుగులో రూపొందిన సీక్వెల్ మూవీస్ స‌క్స‌స్ అవ్వ‌లేదు. మ‌రి.. ప్రేమకథా చిత్రమ్ 2 సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తుందా..? లేదా...? అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments