Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఎన్నికల పోలింగ్ కేంద్రంలో రౌడీషీటర్ : ప్రకాష్ రాజ్

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (14:38 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ల పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరిగాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించింది. అదేసమయంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున గెలిచిన సభ్యులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఎన్నికల వివాదం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల సందర్భంగా వైసీపీకి చెందిన ఒక వ్యక్తి ఎన్నికల హాల్‌లో ఉన్నాడని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. 
 
విష్ణు ప్యానల్ బ్యాడ్జి పెట్టుకుని ఆయన హల్ చల్ చేశారని ఆరోపించారు. ఆ వ్యక్తి పేరు నూకల సాంబశివరావు అని, జగ్గయ్యపేటకు చెందిన వాడని తెలిపారు. జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై రౌడీషీట్ కూడా ఉందని చెప్పారు.
 
అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి జగన్, మోహన్ బాబు, విష్ణులతో సాంబశివరావు దిగిన ఫొటోలను, కొన్ని వీడియోలను ఎన్నికల అధికారికి పంపించారు. ఓటర్లను సాంబశివరావు బెదిరించారని... ఆయన బెదిరింపులకు భయపడిన ఓటర్లు విష్ణు ప్యానల్‌కి ఓట్లు వేశారని చెప్పారు. 
 
'మా' సభ్యులు కాని వారిని ఎన్నికల హాల్‌లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని వెంట పెట్టుకుని విష్ణు ప్యానల్ తిరిగిందని చెప్పారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

Telangana Cabinet expansion: కొండా సురేఖ అవుట్ విజయశాంతి ఇన్?

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments