సంగీతం కోసం కొత్త ప‌క్రియ చేస్తున్న‌ ప్రభాస్ రాధే శ్యామ్

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (19:54 IST)
Radhe syam
ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”.  ప్రేమ‌క‌థ‌ను కొత్త‌గా ఆవిష్క‌రించే క్ర‌మంలో సంగీతానికి పెద్ద పీట వేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందుకోసం దేశంలో వున్న మెలోడి కింగ్ మాస్ట‌ర్ల‌ను వ‌డ‌పోత పడుతున్నారు.

నాలుగు బాష‌ల్లో వ‌స్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్‌లో ప్ర‌త్యేక క‌స‌ర‌త్తు చేశారు. బాలీవుడ్ ఫేమ్ మిథున్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టిక‌కే రెండు పాట‌ల‌కు బాణీలు చేశారు. కుమార్‌, మ‌నోజ్ సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. ఇక తెలుగు, త‌మిళం వ‌చ్చేస‌రికి ద‌క్షిణాది భాష‌ల‌కు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ అందిస్తున్నాడు. ఇప్ప‌టికే ఒక ట్రాక్‌ను ఆయ‌న కంపోజ్ చేశాడు. కృష్ణ‌కాంత్ సాహిత్యం అందించారు. 
 
సంగీతం అనేది పామ‌రుల బాష‌. క‌నుక‌నే అంద‌రినీ అల‌రించేలా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేశారు. ఇలా చేయ‌డం అరుదైన విష‌య‌మ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.  ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కులున్నా సేమ్ ఎమోష‌న్స్‌ను అందిస్తార‌ని భ‌రోసా ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సంగీతంపై మంచి బజ్ ఉంది. మరి ఈ సినిమాలో పాటలు ఎలా ఉంటాయో చూడాలి. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను గుల్హ‌న్ కుమార్, టీ సిరీస్ స‌మ‌ర్పిస్తుంది. యు.వి. క్రియేష‌న్స్ నిర్మిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిర్లక్ష్యం.. తెలియక ఏసీ భోగీలోకి ఎక్కి కింద దిగబోయాడు.. ఇంతలో కాలుజారింది.. చివరికి? (video)

దిశ మార్చుకుంటున్న Cyclone Montha, తీరం అక్కడ దాటే అవకాశం...

హైదరాబాద్ నగరంలో ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య

తీవ్రరూపం దాల్చిన మొంథా : నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు

మొంథా తుఫాను : కూలిపోయిన ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు.. కనెక్టివిటీ తెగిపోయింది..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments