Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2లో షారుక్ కామియోనా? పగలబడి నవ్వుకుంటున్న ప్రభాస్

దర్శక మాంత్రికుడు ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి ది కన్‌క్లూజన్‌ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంటున్న విషయం తెలిసిందే. షూటింగ్ పార్ట్ రెండు నెలలకు ముందే పూర్తయి గుమ్మడి కాయ కొట్టేసినా ఇంకా షూటింగ్ జరుగుతున్నట్లుగా రూమర్లు వస్తూనే

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (04:34 IST)
దర్శక మాంత్రికుడు ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి ది కన్‌క్లూజన్‌ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంటున్న విషయం తెలిసిందే. షూటింగ్ పార్ట్ రెండు నెలలకు ముందే పూర్తయి గుమ్మడి కాయ కొట్టేసినా ఇంకా షూటింగ్ జరుగుతున్నట్లుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఆ కోవలోకి తాజాగా షారుక్ కూడా చేరిపోయాడు. 

ఏమంటే బాహుహలి-2లో బాలివుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఒక కామియో పాత్రలో నటిస్తున్నాడని రూమర్ల మీద రూమర్లు వచ్చేసాయి. ఇవి బాహుబలి హీరో ప్రభాస్‌కు కూడా చేరాయి. ఈ రూమర్లను విని హాయిగా నవ్వుకున్న ప్రభాస్ తర్వాత వాటిని ఉత్తుత్తివిగా తోసిపుచ్చాడు. షారుఖ్ బాహుబలి2 లో భాగం కాదని తేల్చి చెప్పేశాడు. 
 
బాహుబలి పర్యాయపదంగా మారిన ప్రభాస్ ఈ సినిమా అంత పెద్ద బ్రాండ్ సినిమా కాబట్టే నిత్యం దానిపై ఎవరో ఒకరు ఏదో ఒకరకంగా వార్తలు, పుకార్లు, అంచనాలు వదులుతూనే ఉన్నారని, అయితే అవి తనను ఏమాత్రం బాధపెట్టకపోగా బాగా నవ్విస్తున్నాయని చెప్పాడు. 
 
భారతీయ చిత్రపరిశ్రమకు భారీతనం కాదు అతిభారీతనం అంటే ఏమిటో చూపించిన బాహుబలి తన విజువల్ వండర్‌తో ప్రపంచాన్నే మంత్రముగ్ధను చేసింది. దీంతో బాహుబలి2 కోసం కోట్లమంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కూడా. తొలి భాగం కంటే మలిభాగం ఇంకా భారీతనంతో కూడుకుని ఉంటుందని రాజమౌళి చెప్పడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 
 
తొలిభాగంలో సింగిల్‌గానే ఉన్న ప్రభాస్ రెండో భాగంలో ద్విపాత్రాభినయం చేయడమే కాక ప్రేమ, సాహసోపేతమైన యాక్షన్లలో అద్భుత ప్రదర్శన ఇచ్చాడని తెలియడంతో ఏప్రిల్ 28న విడుదల కానున్న బాహుబలి 2 అశేష ప్రేక్షకులను ఉత్కంఠ భరితులను చేస్తోంది. దీంతో ఈ సినిమాపై ఎలాంటి రూమర్ వచ్చినా నిజమేనేమో అనిపిస్తోంది. షారుఖ్ కామియో కూడా దీంట్లో భాగమే.
 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments