Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' దర్శకుడితో పవర్ స్టార్ కొత్త చిత్రం..

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (16:32 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలు చేసేందుకు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే రెండు చిత్రాల్లో నటిస్తున్న ఆయన తాజాగా మరో చిత్రానికి సమ్మతం తెలిపారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి 'సాహో' మూవీ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. 
 
ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ కొత్త పోస్టర్‌ను ఆదివారం రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్‌ను ఒక ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటారని ఓ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టర్‌లో పవన్ వెనుకవైపు నిలబడివున్నట్టు కనిపిస్తున్నారు. ఈ సినిమాకు రవి కె చంద్రన్ కెమెరామెన్‌గా పని చేస్తుంటే, సుజీత్ కథను సమకూర్చి దర్శకత్వం వహించనున్నారు. 
 
ఈ యేడాది "ఆర్ఆర్ఆర్" వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాన్ని అందించిన డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ఇపుడు పవన్‌తో నిర్మించే చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తుండగా, ఆయన సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

విమానంలో మహిళపై అనుచిత ప్రవర్తన.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments