Webdunia - Bharat's app for daily news and videos

Install App

31న మహేష్ - త్రివిక్రమ్ కొత్త చిత్రం అప్‌డేట్... టైటిల్ ఇదేనా?

Webdunia
సోమవారం, 29 మే 2023 (19:21 IST)
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇది మహేశ్ బాబు నటించే 28వ చిత్రం. ఈ చిత్రం టైటిల్‌ను ఈ నెల 31వ తేదీన అధికారికంగా వెల్లడికానుంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబుకు సంబంధించిన ఓ పవర్ ఫుల్ పిక్‌ను విడుదల చేసింది. ఫుల్ మాస్‌ గెటప్‌లో ఉన్న మహేశ్ బాబు నేలతల్లికి వందనం చేస్తుండటం ఆ ఫోటోలో చూడొచ్చు. 
 
మరో రెండు రోజుల్లో ఎస్ఎస్ఎంబీ 28 నంచి మాస్ ధమాకా వచ్చేస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. మహేశ్ బాబు వీరాభిమానులు ఈ చిత్రం టైటిల్‌ను సినిమా థియేటర్లలో రిలీజ్ చేస్తారని వివరించింది. 
 
కాగా, ఈ మూవీలో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీలలు నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. అతడు, ఖలేజీ చిత్రాల తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కలయికతో వస్తున్న ఈ చిత్రానికి "గుంటూరు మిర్చి" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments