బాలయ్య వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పోసాని (video)

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (14:46 IST)
నందమూరి బాలకృష్ణ ఇటీవల తెలంగాణ సీఏం కేసీఆర్‌ను కలవడానికి వెళ్లిన సినీప్రముఖుల గురించి స్పందిస్తూ... తనని పిలవలేదని.. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మీటింగ్.. భూములు పంచుకోవడం కోసమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం వివాదస్పదం అయ్యింది.
 
బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ స్పందించారు. బాలయ్య నిజాయితీపరుడు. డబ్బులు కోసం రాజకీయాల్లోకి రాలేదు అంటూనే బాలయ్యకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ పోసాని ఏమన్నారంటే... త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు.
 
అక్కడ సీఎంగా ఉన్నది ఎన్టీఆర్ కాదు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. వెన్నుపోటు పొడవరు.. పొడుపించుకోరు అన్నారు. అంతటితో ఆగలేదు పోసాని... ఐదేళ్లు కాదు.. మరో పదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వై.ఎస్. జగనే ముఖ్యమంత్రి అని చెప్పారు.

పోసాని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన ఈ వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లోను ఇటు సినీ వర్గాల్లోను హాట్ టాపిక్ అయ్యింది. మరి.. పోసాని వ్యాఖ్యలపై బాలయ్య కానీ.. తెలుగుదేశం తమ్ముళ్లు కానీ.. స్పందిస్తారేమో చూడాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments