Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు పోసాని కృష్ణమురళికి మళ్లీ కరోనా పాజిటివ్

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (11:07 IST)
తెలుగు సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరోమారు కరోనా వైరస్ సోకింది. ఆయన కరోనా వైరస్ బారినపడటం ఇది మూడోసారి. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కేబినెట్ హోదాలో ఉన్నారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. 
 
ఇదిలావుంటే, ఇటీవల పూణెలో జరిగిన షూటింగులో పాల్గొన్న పోసాని.. గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆయనకు జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. గురువారం ఒక్కరోజే పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. బహిరంగ ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలకు వెళ్లే ప్రజలు విధిగా ముఖానికి మాస్కులు ధరించాలని పలు రాష్ట్రాల్లో సూచిస్తూ కరోనా నిబంధనలను కూడా సడలిస్తున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments