`డియర్ మేఘ`లో సాంగ్ రిలీజ్ చేసిన పూజా హెగ్డే

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (17:36 IST)
Megha Akash, Adit Arun
మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''డియర్ మేఘ''. 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్', బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.యంగ్ ఫిల్మ్ మేకర్ సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని 'ఆమని ఉంటే పక్కన..' అనే లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 10.18 నిమిషాలకు 'ఆమని ఉంటే పక్కన..' లిరికల్ పాట లాంఛ్ చేసిన పూజా హెగ్డే చిత్ర యూనిట్ కు బెస్ట్ విశెస్ తెలిపారు.
 
ఆదిత్ అరుణ్, మేఘా ఆకాష్ ల మీద చిత్రీకరించిన ఈ అందమైన లవ్ సాంగ్ ఎలా ఉందో చూస్తే.... ఆమని ఉంటే పక్కన...ఏమని చెప్పను భావన...పోతే మళ్లీ రాదనా...మళ్లీ మళ్లీ చూడనా..యే వానవిల్లో వేల రంగుల్లో కిందే వాలిందో...ఏ తీపిముల్లో నాటి గుండెల్లో నవ్వై పూసిందో..నీ ఊపిరేమో వెచ్చంగ మెల్లో ఇల్లా తాకిందో...నా ధ్యాస మొత్తం నీ మాయలోకే అల్లా జారిందో.. అడుగు, అడుగు నీతోనే..ఆకాశం అంచుకు వెళుతున్నానే..మలుపు, మలుపు నీతోనే మనసులో నే నీకో గుడి కడుతున్నాలే అంటూ ప్రేమను వర్షిస్తుందీ పాట.
 
హరి గౌర బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజిషన్ లో లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్ కృష్ణకాంత్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ''డియర్ మేఘ'' సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టులో థియేటర్ లల్లో విడుదలకు సిద్ధమవుతోంది.
 
ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - కె.వి రమణ, నిర్మాత : అర్జున్ దాస్యన్, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

AI దుర్వినియోగం, పాకిస్తాన్ పార్లమెంట్ లోకి దూసుకొచ్చిన గాడిద, కిందపడ్డ సభ్యులు (video)

Bharat Future City: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అంతా సిద్ధం

కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు రూ.10 లక్షలు ఇస్తా : మాజీ మంత్రి మల్లా రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments