బిగ్ బాస్ ఎపిసోడ్ హైలైట్స్... కౌశల్ - దీప్తిల మధ్య బాండింగ్స్ గురించి చర్చ

బిగ్ బాస్ హౌస్‌లో ఇంకో వారం మాత్రమే మిగిలి ఉండటంతో అందరూ రిలాక్స్‌డ్‌గా కనిపించారు. సామ్రాట్, తనీష్, గీతా, దీప్తి, కౌషల్‌లలో ఎవరో ఒకరు విజేతగా నిలవబోతున్నారు. ఐదుగురు ఫినాలే కంటెస్టెంట్స్‌కు డబ్బులతో

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (11:42 IST)
బిగ్ బాస్ హౌస్‌లో ఇంకో వారం మాత్రమే మిగిలి ఉండటంతో అందరూ రిలాక్స్‌డ్‌గా కనిపించారు. సామ్రాట్, తనీష్, గీతా, దీప్తి, కౌషల్‌లలో ఎవరో ఒకరు విజేతగా నిలవబోతున్నారు. ఐదుగురు ఫినాలే కంటెస్టెంట్స్‌కు డబ్బులతో స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు బిగ్ బాస్. సరదాగా జోకులు వేసుకుంటున్నప్పటికీ చివరిగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌తో సీరియస్ వాతావరణం నెలకొంది. 
 
కౌశల్ - దీప్తిల మధ్య బాండింగ్స్ గురించి ఎప్పట్లాగే డిస్కషన్ జరుగుతుండగా బిగ్ బాస్ నుండి టాస్క్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఫినాలేలో మీతో పాటు పోటీగా ఎవరు ఉండాలనుకుంటున్నారు...ఎవరు ఉండకూడదనుకుంటున్నారో తెలియజేస్తూ..బోర్డ్‌పై ఉన్న ఫోటోల పక్కన హార్ట్ సింబల్, డిస్‌లైక్ సింబల్ పెట్టాలని ఆదేశించారు బిగ్ బాస్. 
 
తనీష్... సామ్రాట్ ఫైనల్‌‌లో తనతో పాటు ఉండాలని, కౌశల్‌ ఫైనల్‌లో ఉండకూడదని సింబల్స్ ఇచ్చారు. దీప్తి నల్లమోతు మాట్లాడుతూ... గీతా మాధురిని ఫైనల్‌లో చూడాలనుకుంటున్నానని, ఎప్పుడూ నెగిటివ్ థింకింగ్‌తో ఒంటరి చేస్తున్నామని ఆరోపిస్తూనే ఉంటారని కౌషల్‌ను వద్దని చెప్పారు. 
 
గీతా మాధురి... తనతో పాటు దీప్తి నల్లమోతు ఫైనల్‌లో ఉండాలన్నారు. కౌశల్‌తో తాము ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నా కావాలనే ఆ ఫీలింగ్ కలిగిస్తున్నారని, అందుకే ఫైనల్‌లో ఉండకూడదనుకుంటున్నాని చెప్పారు. 
 
సామ్రాట్ మాట్లాడుతూ.. తనీష్ తనతో ఫైనల్‌లో ఉండాలన్నారు. ఫైనల్‌లో కౌషల్‌ను తనతో పాటు ఉండకూదడని కోరుకుంటున్నానని చెప్పారు. ఇక ఫైనల్‌గా కౌశల్ మాట్లాడుతూ.. నాతో పాటు గీతా మాధురి ఉండొచ్చనుకుంటున్నానన్నారు. అందరిలో సామ్రాట్ వీక్ కంటెస్టెంట్ కాబట్టి అతన్ని ఫైనల్‌లో చూడాలనుకోవడం లేదన్నారు. 
 
ఈ టాస్క్ ముగియగానే హౌస్‌లో ‘నన్ను దోచుకుందువటే’ హీరోహీరోయిన్లు సుధీర్ బాబు, నభా నతేష్‌లు బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు. సినిమా ముచ్చట్లు, సరదా సరదా టాస్క్‌లతో హౌస్ అంతా పాజిటివ్ ఎనర్జీ నింపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

AI దుర్వినియోగం, పాకిస్తాన్ పార్లమెంట్ లోకి దూసుకొచ్చిన గాడిద, కిందపడ్డ సభ్యులు (video)

Bharat Future City: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అంతా సిద్ధం

కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు రూ.10 లక్షలు ఇస్తా : మాజీ మంత్రి మల్లా రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments