Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సూర్యకు బెదిరింపులు - ఇంటికి సాయుధ బలగాల భద్రత

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (09:20 IST)
తమిళ హీరో సూర్యకు వన్నియర్ సంఘ నేతలు బెదిరించారు. దీంతో ఆయన ఇంటికి సాయుధ బలగాలతో భద్రత కల్పించారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం "జై భీమ్". ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, పాత్రల పేర్లు వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా, తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలకు ఓ ఓటు బ్యాంకులా ఉన్న వన్నియర్ వర్గం ప్రతిష్టను దిగజార్చేలా ఉందనే వివాదం గత కొన్ని రోజులుగా నడుస్తోంది. దీనిపై అనేకమంది ప్రకటనలు విడుదల చేశారు. 
 
ముఖ్యంగా, ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ సూర్యను అభినందిస్తున్నారు. కానీ, వన్నియర్ వర్గ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో పీఎంకే పార్టీకి చెందిన నాగపట్టణం జిల్లా కార్యదర్శి పళనిస్వామి విడుదల చేసిన ప్రకటనలో హీరో సూర్యను బెదిరించారు. దీంతో స్థానిక టి.నగర్‌ ఆర్కాట్ రోడ్డులో ఉన్న హీరో సూర్య ఇంటికి సాయుధబలగాలతో భద్రతను కల్పించారు. 
 
కాగా, "జై భీమ్" చిత్రం దీపావళి పండుగ సందర్భంగా డిసెంబరు 2వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన వన్నియర్ వర్గ నేతలు చిత్ర నిర్మాతలైన హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతికలకు రూ.5 కోట్ల పరువు నష్టం దావా నోటీసులు పంపించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments