Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జున సోదరి నాగసుశీలపై కేసు నమోదు

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (16:59 IST)
హీరో అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీలపై హైదరాబాద్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమంపై నాగసుశీలతో పాటు మరికొందరు కలిసి దాడి చేశారంటూ చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో నాగసుశీలతో పాటు శ్రీనివాస్‌లు సంయుక్తంగా పలు చిత్రాలు నిర్మించడంతో వ్యాపార భాగస్వామిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారిమధ్య భూవివాదం కూడా ఉంది. 
 
ఈ క్రమంలో శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్టనర్ చింతలపూడి శ్రీనివాస్, నాగసుశీల మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే, తనకు తెలియకుండానే శ్రీనివాస్ తన భూములను విక్రయించాడని గతంలో పోలీసులకు నాగసుశీల ఫిర్యాదు చేశారు.
 
మరోవైపు, తనను జైలుపాలు చేసైనా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకోవడానికి తనపై నాగసుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగసుశీల తనయుడు సుశాంత్‌తో నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామన్నారు. ఈ వివాదాల నేపథ్యంలో నాగసుశీలపై శ్రీనివాస్ తాజాగా ఫిర్యాదు చేయడంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లికి నిరాకరించాడని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టర్ (Video)

ఫార్చునర్ కారును బహుమతిగా ఇచ్చారు.. సున్నితంగా తిరస్కరించాను : పోలవరం ఎమ్మెల్యే (Video)

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments