Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక మందన్న వీడియోపై స్పందించిన ప్రధాని

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (23:06 IST)
హీరోయిన్ రష్మిక మందన్న, డీప్‌ఫేక్ వీడియో ఆందోళనకరంగా ఉంది. ఈ AI- రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు ఎంత ప్రమాదకరమైనవో ప్రధాని నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు 'డీప్‌ఫేక్' వీడియోను ఖండించారు.
 
ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, భారతీయ జనతా పార్టీ దీపావళి మిలన్ కార్యక్రమంలో జర్నలిస్టులను ఉద్దేశించి ఇటీవల చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ కూడా 'డీప్‌ఫేక్' వీడియోపై ప్రస్తావించారు.
 
తన ప్రకటనలో, 'డీప్‌ఫేక్‌లను' సృష్టించడానికి కృత్రిమ మేధస్సును దుర్వినియోగం చేస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. ఈ ఏఐ సంక్షోభం గురించి మీడియా ప్రజలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని అన్నారు.
 
రష్మిక మందన్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేస్తూ 'డీప్ ఫేక్‌లు సరికొత్త మరింత ప్రమాదకరమైన, హానికరమైన తప్పుడు సమాచారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
 
ఐటి చట్టం, 2000లోని సెక్షన్ 66డి ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి ‘వ్యక్తిగతం’ చేసి మోసం చేసిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. రష్మిక మందన్న తర్వాత నటీనటులు కాజోల్, కత్రినా కైఫ్ కూడా డీప్‌ఫేక్ వీడియోల బారిన పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments