నిద్రమాత్రలు మింగిన గాయని కల్పన ఆరోగ్యం ఎలావుంది? (Video)

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (09:56 IST)
హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో మంగళవారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సినీ నేపథ్యం గాయని కల్పన ఆరోగ్యంపై ఆమె అభిమానులు, సహచర నేపథ్యగాయనీ గాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి వెంటిలేటరుపై చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి పలువురు ఆస్పత్రికి వస్తున్నారు. వీరిలో గాయనీగాయకులు శ్రీకృష్ణ, సునీత, గీతామాధురి, కారుణ్య తదితరులు ఉన్నారు. వారంతా వైద్యులను అడిగి సునీత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాల సమాచారం. 
 
హైదరాబాద్ నగరంలోని నిజాంపేటలో ఉంటున్న కల్పన మంగళవారం రాత్రి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఆమె ఫ్లాట్‌కు చేరుకుని తలుపులు బద్ధలుకొట్టి ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించిన కారణాలు తెలియరాలేదు. ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారన్న విషయం తెలుసుకున్న కల్పన భర్త ప్రసాద్ హుటాహుటిన చెన్నై నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్నట్టు సమాచారం. ఆయన వద్ద విచారణ జరిపితేగానీ సునీత ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇకలేరు

దూసుకొస్తున్న మొంథా : కాకినాడ పోర్టులో ఏడో ప్రమాద హెచ్చరిక

మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ.. రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు

Kavitha: కొత్త మేకోవర్‌లో కనిపించిన కల్వకుంట్ల కవిత

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments