Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఏడాదికి ఒక సినిమా చేస్తా: రాజ్‌ కందుకూరి

దర్శక నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించిన రాజ్‌ కందుకూరి ఈ ఏడాది 'పెళ్ళిచూపులు' చిత్రాన్ని నిర్మించి విజయాన్ని స్వంతం చేసుకున్నారు. ఆదివారంనాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. 'పెళ్ల

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (21:41 IST)
దర్శకనిర్మాతగా పలు చిత్రాలు నిర్మించిన రాజ్‌ కందుకూరి ఈ ఏడాది 'పెళ్ళిచూపులు' చిత్రాన్ని నిర్మించి విజయాన్ని స్వంతం చేసుకున్నారు. ఆదివారంనాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. 'పెళ్లిచూపులు' చిత్రం 75 రోజులను పూర్తి చేసుకుని వందరోజులు దిశగా వెళుతుంది. చిన్న బడ్జెట్‌తో చేసిన ఈ సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలని నేను, సురేష్‌ బాబు ఆలోచన చేసినప్పుడు, స్పెషల్‌ షోస్‌ వేద్దామనే ఆలోచన ఇద్దరికీ వచ్చింది. 
 
అందువల్ల సినిమా విడుదలకు ముందే స్పెషల్‌ షోస్‌ వేశాం. 'గౌతమబుద్ధ' సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. తొలి చిత్రంతో నంది అవార్డు, దలైలామా అవార్డు, వంశీ అకాడమీ అవార్డు వచ్చింది. తొమ్మిదేళ్ల సినీ జర్నీలో పది సినిమాలు చేశాను. కానీ పెళ్లిచూపులు సక్సెస్‌ నాకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. 
 
చాలామంది హీరోను బడ్జెట్‌ ఇంత ఉంది అంటూ స్టార్ట్‌ చేస్తారు. అయితే సినిమా కంటెంట్‌ కూడా చాలా ముఖ్యం. మంచి కథను తయారుచేసుకుని దానికి ఏ హీరో సరిపోతాడో అతని సినిమా చేస్తే మంచి విజయాన్ని సాధిస్తుంది. నా ధర్మపథ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఒకట్రెండు కోట్ల బడ్జెట్‌తో కొత్తవాళ్లతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతాను. భవిష్యత్‌లో ధర్మపథ క్రియేషన్స్‌, రాజ్‌ కందుకూరి అంటే కొత్తవాళ్లను ప్రోత్సహిస్తారనే పేరుంటే చాలు.
 
ఇకపై ఏడాదికి ఓ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అలాగే నా డైరెక్షన్‌లో కూడా సినిమా చేయాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతం ఐబిఎం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో వర్క్‌ చేసిన ఒక వ్యక్తి సినిమాలపై ఆసక్తితో మంచి సినిమా కథను తయారు చేసుకుని నా వద్దకు వచ్చాడు. కథ నచ్చడంతో విజయదేవర కొండ హీరోగా సినిమా చేస్తున్నాం. అలాగే తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో 'సైన్మా' సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతం కథను తయారుచేస్తున్నాడు. ఆ సినిమా ప్రారంభం కావడానికి రెండు, మూడు నెలల సమయం పడుతుంది. అలాగే ఓ స్టార్‌ హీరోతో కూడా సినిమా చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటి వివరాలను తెలియజేస్తానంటూ..వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

ఫ్యాంటు జేబులో పేలిన మొబైల్... తొడకు గాయాలు...

ఫ్లయింగ్ ట్యాంక్‌లు.. జూలైలో భారత్‌కు 3 అపాచీ హెలికాఫ్టర్లు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments