అమేజాన్ ప్రైమ్ కోసం గౌతమ్ మీనన్ వెబ్ ‌సిరీస్

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (13:32 IST)
నిర్మాతగా, దర్శకుడిగా రాణిస్తున్న గౌతమ్ మీనన్ తాజాగా అభిమానులకు శుభవార్త చెప్పారు. అమేజాన్ ప్రైమ్ వీడియో కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. స్టోరీ విషయంలో ఇటీవల చర్చలు జరగగా, అమేజాన్ వారికి నచ్చడంతో వెబ్ సిరీస్‌ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ వెబ్ సిరీస్‌కి పని చేయనున్నారు. 
 
లాక్‌డౌన్ పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. పీసీ శ్రీరామ్ తన ట్విట్టర్ ద్వారా గౌతమ్ మీనన్‌తో కలిసి వెబ్ సిరీస్ చేయనున్నట్టు పేర్కొన్నాడు. ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి జయలలితపై గౌతమ్ మీనన్ తీసిన క్వీన్ వెబ్ సిరీస్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే లాక్‌డౌన్ సమయంలో త్రిష, శింబు ప్రధాన పాత్రలలో ''కార్తీక్ డయిల్ సయిద ఎన్'' అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. 
 
ఇందులో శింబు, త్రిష మాత్రమే కనిపిస్తారు. ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటూ షూట్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఇది. దీనికి రెహమాన్ నేపథ్య సంగీతం అందించడం విశేషం. అభిమానులకు ఓ సినిమా చూసిన అనుభూతిని షార్ట్ ఫిల్మ్‌లోనే కలిగించాడు గౌతమ్ మీనన్. దీంతో గౌతమ్ మీనన్ తీసే తదుపరి వెబ్ సిరీస్‌పై సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌‍లైన్‌లో రేటింగ్ ఇస్తే డబ్బులు వస్తాయన్న ఆశ.... ఏకంగా రూ.54 లక్షలు గోవిందా

కోల్డ్‌రిఫ్ వివాదంలో కీలక మలుపు : దగ్గుమందు తయారీ కంపెనీ యజమాని అరెస్టు

నిద్రిస్తున్న భర్త సలసల కాగే నూనె పోసిన భార్య

నా కుమార్తెకు విషపు సూది వేసి చంపేశారు.. ఓ తండ్రి ఫిర్యాదు

ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments