Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గజదొంగ' భార్యగా పాయల్ రాజ్‌పుత్...(video)

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (10:17 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 'మహానటి' సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా 'మహానటి' చిత్రం వచ్చింది. ఆ తర్వాత స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత, రాజకీయ చరిత్ర ఆధారంగా 'ఎన్టీఆర్ కథానాయుకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాలు రాగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా చేసుకుని 'యాత్ర' చిత్రం వచ్చింది. వీటిలో 'మహానటి', 'యాత్ర' చిత్రాలు సూపర్ హిట్‌ సాధించి, కాసుల వర్షం కురిపించాయి. 
 
ఈ నేపథ్యంలో తెలుగు వెండితెరపై మరో బయోపిక్ రానుంది. 1980-90 దశకంలో స్టూవర్టుపురం గజదొంగగా చెలామణి అయిన టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కనుంది. ఈయన ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, దొంగతనాలు, దోపిడీలు చేయడంలో ఆరితేరాడు. 
 
ఇపుడు ఈయన జీవిత చరిత్ర ఆధారంగా టైగర్ నాగేశ్వర రావు అనే టైటిల్‌తో చిత్రం నిర్మితంకానుంది. ఈ చిత్రంలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించనుండగా, హీరోయిన్‌గా ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ నటించనుంది. ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments