Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారాహి వాహనంపై రోడ్లపై తిరుగుతాను.. మీ ముఖ్యమంత్రిని రమ్మను ఆపేందుకు...

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (17:17 IST)
"వారాహి వాహనంపై ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరుగుతాను.. ఎవరు ఆపుతారో నేనూ చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను.. ఈ కూసే గాడిదలను రమ్మను.. నా వారాహిని ఆపండి.. నేనేంటో అపుడు చూపిస్తా" అంటూ వైకాపా నేతలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సవాల్ విసిరారు. 
 
ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతు భరోసా యాత్ర జరిగింది. ఇందులో ఆయన పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగిస్తూ, వైకాపా నేతను తనను వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారని, వారానికి ఒక రోజు వస్తేనే తట్టుకోలేకపోతున్నారన్నారు. తన వద్ద తాతలు సంపాదించిన డబ్బు లేదన్నారు. 
 
అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు లేదన్నారు. తనకు వేల కోట్లు, వందల కోట్లు ఇచ్చిన నాయకులు ఎవరూ లేరన్నారు. చిన్నచిన్నవాళ్లు, కొత్తవాళ్లు, ఇంకా అధికారం చూడని వ్యక్తులు సమూహమే తన వద్ద ఉందన్నారు. అందుకే వ్యూహం సంగతి తనకు వదిలివేయాలని, వైకాపా వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తేలేదన్నారు. అందుకు తాను కట్టుబడివున్నానని చెప్పారు. 
 
పైగా ఈ వేదికపై నుంచి ఒక్క మాట చెబుతున్నా...  నా మీద లాఠీపడితే రత్కం చిందించడానికైనా సిద్ధంగా ఉన్నాను. జైల్లో కూర్చోవడానికి కూడా వెనుకాడను. నా సినిమాలు ఆపేస్తావా.. ఆపేసుకో.. నన్ను ఏమీ చేయలేవు. నువ్వు కొట్టే కొద్దీ పైకి లేస్తానేగానీ కిందపడేది లేదని పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి వేదికగా గర్జించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments