Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారాహి వాహనంపై రోడ్లపై తిరుగుతాను.. మీ ముఖ్యమంత్రిని రమ్మను ఆపేందుకు...

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (17:17 IST)
"వారాహి వాహనంపై ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరుగుతాను.. ఎవరు ఆపుతారో నేనూ చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను.. ఈ కూసే గాడిదలను రమ్మను.. నా వారాహిని ఆపండి.. నేనేంటో అపుడు చూపిస్తా" అంటూ వైకాపా నేతలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సవాల్ విసిరారు. 
 
ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతు భరోసా యాత్ర జరిగింది. ఇందులో ఆయన పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగిస్తూ, వైకాపా నేతను తనను వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారని, వారానికి ఒక రోజు వస్తేనే తట్టుకోలేకపోతున్నారన్నారు. తన వద్ద తాతలు సంపాదించిన డబ్బు లేదన్నారు. 
 
అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు లేదన్నారు. తనకు వేల కోట్లు, వందల కోట్లు ఇచ్చిన నాయకులు ఎవరూ లేరన్నారు. చిన్నచిన్నవాళ్లు, కొత్తవాళ్లు, ఇంకా అధికారం చూడని వ్యక్తులు సమూహమే తన వద్ద ఉందన్నారు. అందుకే వ్యూహం సంగతి తనకు వదిలివేయాలని, వైకాపా వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తేలేదన్నారు. అందుకు తాను కట్టుబడివున్నానని చెప్పారు. 
 
పైగా ఈ వేదికపై నుంచి ఒక్క మాట చెబుతున్నా...  నా మీద లాఠీపడితే రత్కం చిందించడానికైనా సిద్ధంగా ఉన్నాను. జైల్లో కూర్చోవడానికి కూడా వెనుకాడను. నా సినిమాలు ఆపేస్తావా.. ఆపేసుకో.. నన్ను ఏమీ చేయలేవు. నువ్వు కొట్టే కొద్దీ పైకి లేస్తానేగానీ కిందపడేది లేదని పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి వేదికగా గర్జించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments