Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హరిహరవీరమల్లు' నుంచి కీలక అప్‌డేట్... షూటింగ్ ప్రారంభం!!

ఠాగూర్
శుక్రవారం, 16 ఆగస్టు 2024 (19:40 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాలనలో బిజీగా ఉన్నప్పటికీ తాను అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది రోజుల్లో 'హరి హర వీర మల్లు' చిత్రీకరణలో పాల్గొంటారని చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్ర యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకుగాను నిర్మాణ సంస్థ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది.
 
ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు 14న తిరిగి ప్రారంభించినట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈరోజు నుంచి యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణ ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ చిత్రీకరణలో సుమారు 400-500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు.
 
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారిగా చారిత్రాత్మక యోధుడుగా కనిపించనున్నారు. జ్యోతి కృష్ణ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు కూడా భాగమయ్యారు. 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' త్వరలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్!

జడ్జి వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడబోయిన ఎస్ఐ (Video)

20న శ్రీవారి అర్జిత సేవా లక్కీడిప్ టిక్కెట్లు విడుదల!!

వార్షిక సార్థి అభియాన్‌ను కొనసాగిస్తున్న మహీంద్రా: ట్రక్ డ్రైవర్ల కుమార్తెలకు కొత్తగా 1,000 స్కాలర్‌షిప్‌లు

మూవింగ్ కారులో టీనేజ్ బాలికపై సామూహిక అఘాయిత్యం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments