Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ దూకుడు... మరో కొత్త ప్రాజెక్టుపై ఫోకస్!

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (17:34 IST)
జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు దూకుడు పెంచాడు. అటు రాజకీయాల్లో, ఇటు సినిమా రంగాలను ఏలేలా ఆయన తన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇందులోభాగంగా, కొత్త మూవీ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతూ సాగిపోతున్నారు. 
 
ఇప్పటికే బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్‌ను తెలుగులోకి వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇపుడు హైదరాబాద్ నగరంలో సాగుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇంకా ముగియముందే ఆయన దర్శకులు క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకకర్, సురేందర్ రెడ్డిలతో కలిసి పని చేసేందుకు సమ్మతించారు. 
 
తాజాగా పవన్ చేస్తున్న మరో సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడింది. సితార ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. మలయాళంలో హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు రీమేక్‌గా ఈ చిత్రం నిర్మితంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments