Webdunia - Bharat's app for daily news and videos

Install App

వకీల్ సాబ్ బాటలో భీమ్లా నాయక్.. మార్చి 25న ఓటీటీలోకి..!

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (13:08 IST)
Bhimla Nayak poster
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి హీరో రానా కాంబోలో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. సితార ఎంటర్‌టైన్‎మెంట్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. రానా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. 
 
డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందించారు. ఈ మూవీ గత నెల ఫిబ్రవరి 25న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.  మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‎గా రూపుదిద్దుకున్న ఈ సినిమా.. ఆత్మ గౌరవానికి అహంకారానికి మధ్య నడిచే పోరుగా తెరకెక్కింది.  
 
తాజాగా ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలచేయబోతున్నారు. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‎ను హాట్ స్టార్ డిస్నీతో పాటు ఆహా కూడా సొంతం చేసుకుంది. భీమ్లా నాయక్‎ను శుక్రవారం మార్చి 25న విడుదలచేస్తున్నట్లు ఆహా ప్రకటించింది.
 
గతేడాది వచ్చిన వకీల్ సాబ్ సినిమాను కూడా విడుదలైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాను కూడా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీ బాట పట్టిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments