వకీల్ సాబ్ బాటలో భీమ్లా నాయక్.. మార్చి 25న ఓటీటీలోకి..!

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (13:08 IST)
Bhimla Nayak poster
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి హీరో రానా కాంబోలో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. సితార ఎంటర్‌టైన్‎మెంట్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. రానా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. 
 
డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందించారు. ఈ మూవీ గత నెల ఫిబ్రవరి 25న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.  మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‎గా రూపుదిద్దుకున్న ఈ సినిమా.. ఆత్మ గౌరవానికి అహంకారానికి మధ్య నడిచే పోరుగా తెరకెక్కింది.  
 
తాజాగా ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలచేయబోతున్నారు. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‎ను హాట్ స్టార్ డిస్నీతో పాటు ఆహా కూడా సొంతం చేసుకుంది. భీమ్లా నాయక్‎ను శుక్రవారం మార్చి 25న విడుదలచేస్తున్నట్లు ఆహా ప్రకటించింది.
 
గతేడాది వచ్చిన వకీల్ సాబ్ సినిమాను కూడా విడుదలైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాను కూడా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీ బాట పట్టిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారాస డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

దీపావళి వేడుకలకు దూరంగా ఉండండి : పార్టీ నేతలకు హీరో విజయ్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments