Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో లేడీ వీరాభిమాని... పవన్ కటౌట్‌కు పాలాభిషేకం

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (16:04 IST)
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మేనియా సాగుతోంది. ఆయన నటించిన "భీమ్లా నాయక్" చిత్రం శుక్రవారం విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ చిత్రం విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేవు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అధికార వైపాకా నేతలు ఒత్తిడితో ప్రభుత్వ అధికారులు పలు ఆటంకాలు సృష్టించారు. సృష్టిస్తున్నారు కూడా. 
 
అయితే, ఫ్యాన్స్ మాస్ ఫాలోయింగ్ ముందు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇవేమీ పని చేయడం లేదు. శుక్రవారం నుంచే ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. కటౌట్‌లు, డప్పులు, నృత్యాలు, పూజలు, ఇలా నానా హంగామా చేస్తున్నారు. 
 
అయితే, ఓ మహిళ అభిమాని అయితే, ఏకంగా కటౌట్‌పైకి ఎక్కి పవన్‌కు పాలాభిషేకం చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అవుతుంది. మెడలో ఎర్రటి కండువా ధరించి, పాల ప్యాకెట్‌ను నోటితో చింపి, పవన్ కటౌట్‌పై పాలు పోసింది. పవన్‌కు ఆడవాళ్ళలో మంచి ఫాలోయింగ్ వుంది. కానీ, ఇలాంటి సంఘటన ఎపుడూ చూడలేదు. 
 
కాగా, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చగా థమన్ సంగీతం సమకూర్చారు. రానా దగ్గుబాటి విలన్. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లు. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానరులో చిత్రాన్ని నిర్మించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments