Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్క నిర్మాత వద్ద మాత్రమే ప్రాధేయపడ్డాను : పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (18:15 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర నిర్మాతల్లో ఏఎం రత్నం ఒకరు. ఈయన ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. అలాగే, తమిళ చిత్ర పరిశ్రమను పరిధిని పెంచిన నిర్మాతల్లో ఆయన ఒకరు. అలాంటి నిర్మాత పుట్టిన రోజు నేడు. దీంతో ఆయనకు అనేక మంది సినీ సెలెబ్రిటీల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాంటివారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఈ సందర్భంగా ఆయనకు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏఎం రత్నంతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. 
 
'నాతో సినిమా చేయమని ఇప్పటివరకు ఏ ఒక్క నిర్మాతను అడగలేదు. ఒక్క రత్నంని మాత్రమే అడిగాను. ఆయనతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. రత్నంగారి బంధువు ఒకరు నాకు నెల్లూరులో సన్నిహిత మిత్రుడు. ఆ పరిచయంతో రత్నంగారిని చెన్నైలో కలుస్తుండేవాణ్ణి. 
 
ముఖ్యంగా తన సినీ కెరీర్‌లో 'ఖుషీ' సినిమాను నిర్మించి నాకు మరచిపోలేని హిట్ ఇచ్చారు. సినిమాలో కళాత్మకత ఎక్కడా తగ్గకుండానే వాణిజ్య అంశాలను, ఆధునిక సాంకేతికత మేళవించి మన సినిమాల మార్కెట్ పరిధి పెంచారు. ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాన' అని పవన్ అన్నారు. ప్రస్తుతం ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో పవన్ ఓ భారీ సినిమా చేస్తున్నారు. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments