Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుచూరి వెంకటేశ్వర రావుకు సతీవియోగం

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:23 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కథ, మాటల రచయిత పరుచూరి వెంకటేశ్వర రావుకు సతీవియోగం కలిగింది. ఆయన భార్య విజయలక్ష్మి శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమెకు వయసు 74 యేళ్లు. గుండెపోటుతో ఆమె మరణించినట్టు కుటుంబీకులు తెలిపారు. 
 
విజయలక్ష్మి మృతి విషయాన్ని తెలుసుకున్న పలువురు తెలుగు సినీ ప్రముఖులు పరుచూరి వెంకటేశ్వరరావుకు సంతాపాన్ని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి చేరుకున్న పరుచూరి గోపాలకృష్ణ, సోదరుని ఓదార్చే ప్రయత్నం చేశారు. 
 
అలాగే, విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానభూతిని తెలిపారు. పరుచూరి వెంకటేశ్వరరావు తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments