Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు ఆస్కార్ అవార్డు

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (11:19 IST)
అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతున్న 91వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఇండియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి ఆస్కార్ అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా నిర్మించిన "పీరియడ్‌ ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్" అనే డాక్యుమెంటరీ సినిమాని ఆస్కార్‌ వరించింది. 
 
ఈ సినిమాలో ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న పీరియడ్స్ (రుతుక్రమ) సమస్యలపై డాక్యుమెంటరీ రూపంలో చూపించారు. ఈ చిత్రానికి రేకా జెహ్‌తాబ్చి దర్శకత్వం వహించారు. ఆస్కార్‌ అవార్డును అందుకున్న రేకా... స్టేజ్‌పై ఉద్వేగానికి లోనయ్యారు. ఓ మై గాడ్‌. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యపై నేను డాక్యుమెంటరీ తీస్తే దానికి ఆస్కార్ వచ్చింది. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
 
ఇప్పటివరకు ఎన్నో ఇండియన్ సినిమాలు ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాయి. అవార్డు మాత్రం దక్కించుకోలేదు. ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. అలాంటిది ఓ డాక్యుమెంటరీ చిత్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలిచి... ఆస్కార్ అవార్డు దక్కించుకున్న తొలి ఇండియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ చరిత్ర సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments