Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేశ్‌కు అరెస్టు వారెంట్

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (13:53 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత, హీరో పవన్ కళ్యాణ్ వీరాభిమాని బండ్ల గణేశ్‌కు ఏపీలోని ఒంగోలు జిల్లా రెండో ఏఎంఎం కోర్టు తాజాగా అరెస్టు వారెంట్ జారీచేసింది. ఓ చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్టు ఈ వారెంట్‌ను జారీచేసింది. 
 
ఈ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేశ్ రూ.1.25 కోట్లకు ఓ చెక్ ఇచ్చారు. ఆ చెక్కును బ్యాంకులో వేయగా, తగినంత మొత్తంలో నిధులు లేకపోవడంతో ఆ చెక్క బౌన్స్ అయింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. 
 
ఈ కేసు విచారణ పలుమార్లు జరుగగా, బండ్ల గణేశ్ హాజరుకాలేదు. దీంతో బండ్ల గణేశ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. ఫలితంగా ఆయన సోమవారం బండ్ల గణేశ్ కోర్టుకు రానున్నారు. 
 
గతంలో కూడా కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి వద్ద రూ.13 కోట్ల రుణం తీసుకున్న బండ్ల గణేశ్‌పై తిరిగి చెల్లించకపోవడంతో దానిపై కూడా కేసు నమోదైవుంది. ఈ కేసులో కూడా బండ్ల గణేశ్ హాజరుకాకపోవడంతో కడప కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఆ తర్వాత ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments