Webdunia - Bharat's app for daily news and videos

Install App

#NTRMahanayakudu - నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై..?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (19:20 IST)
మహానాయకుడు సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తయ్యాయి. ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మహానాయకుడులో రానా పాత్ర హైలైట్ అవుతుందని సినీ పండితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో భాగమైన మహానాయకుడు ట్రైలర్ విడుదలైంది. 
 
రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం ఈ ట్రైలర్‌లో కంటికట్టినట్లు చూపించారు. ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లడం, ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, ఢిల్లీ రాజకీయాలను ఎదిరించి విధానం ఈ ట్రైలర్‌లో కనిపించింది. 
 
''నిశ్శబ్దాన్ని చేతగానితనం అనుకోవద్దు .. మౌనం మారణాయుధంతో సమానమని మరిచిపోకు'' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అదిరింది. ఇచ్చిన ప్రతి మాటా నిలబడాలి.. చేసిన ప్రతి పనీ కనబడాలి. ఇన్ టైమ్- ఆన్ డోర్ అనే ఎన్టీఆర్ డైలాగ్, చెప్పేటోళ్లు వుండాలి. లేకుంటే ఆరుకోట్ల మంది ఆయన పక్కనున్నా.. ఒంటరోడైపోతాడు.. అని రానా చెప్పే డైలాగ్ బాగుంది.
 
ఇంకా చివరిగా ''నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చా'' అనే మహానాయకుడి ట్రైలర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

SSC Hall Tickets: విద్యార్థులకు నేరుగా వాట్సాప్ ద్వారా హాల్ టిక్కెట్లు

కేబినేట్‌లోనూ లేదు.. ఎమ్మెల్సీనీ కాదు.. కార్పొరేషన్ చైర్మన్‌గా నాగబాబు..?

కాబోయే భార్యతో ఉరివేసుకున్నట్టుగా సెల్ఫీ దిగిన యువకుడు.. విషాదాంతంగా ముగిసిన ఫ్రాంక్

Bride Gives Birth a Baby: లేబర్ వార్డులో నవ వధువు-పెళ్లైన మూడో రోజే తండ్రి.. అబ్బా ఎలా జరిగింది?

ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం వంతారా సందర్శించిన ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments