Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ కథానాయకుడు, 100 థియేటర్లలో ఎన్టీఆర్ 100 విగ్రహాల ఏర్పాటు..! (video)

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (15:13 IST)
మహానుభావుడు, మహానటుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలోనే సరికొత్త ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఎన్టీఆర్ చిత్ర యూనిట్. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన 100 థియేటర్లలో ఎన్టీఆర్ 100 విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. 
 
తొలి విగ్రహాన్ని నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్ తిరుపతి పీజేఆర్ థియేటర్లో మంగళవారం విడుదల చేయనున్నారు. 
 
జనవరి 7, 8 తేదీల్లో నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నిమ్మకూరు, బెంగళూరు, తిరుపతి వెళ్లి కథానాయకుడు ప్రమోషన్లో పాల్గొననున్నారు. 
 
ఆ తర్వాత విగ్రహం విడుదల చేయనున్నారు బాలయ్య, విద్యాబాలన్. ఈ కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు ఎన్టీఆర్ చిత్ర యూనిట్. ఎన్టీఆర్ బయోపిక్‌లో తొలిభాగం ఎన్టీఆర్ కథానాయకుడును దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు. 
 
నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, నరేష్ vk, మురళీ శర్మ, జిష్షు సేన్ గుప్తా, నిత్యా మీనన్, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రాజా, కైకాల సత్యనారాయణ త‌దిత‌రులు న‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ ఈనో వాడండి: నారా లోకేష్

కరోనా చాలదన్నట్టు.. అమెరికా కోసం కొత్త ఫంగస్‌ను అభివృద్ధి చేసిన చైనా (Video)

త్వరలో భారత్‌లో స్టార్ లింక్ సేవలు : కేంద్ర మంత్రి సింథియా

ఒరిస్సా ఆస్పత్రిలో విషాదం.. ఇంజెక్షన్ వికటించి ఐదుగురు మృతి

NTR food habits: ఒకేసారి 40 బజ్జీలు, రెండు ఫుల్ చికెన్ లాగించేసేవారు.. ట్రెండింగ్ ఇదే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments