Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనం కోసం జోలె పట్టిన రారాజు కథ : ఎన్టీఆర్ బయోపిక్ రేపే విడుదల

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (11:43 IST)
స్వర్గీయ ఎన్.టి. రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా బుధవారం ప్రేక్షకుల ముందుకురానుంది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి భాగం జనవరి 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. జనం కోసం జోలె పట్టిన రారాజు కథ జనవరి 9వ తేదీన రిలీజ్ అంటూ అందులో పేర్కొంది. 
 
ఇందులో ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు హీరో నందమూరి బాలకృష్ణ నటించారు. ఆయన భార్య బసవతారకంగా విద్యాబాలన్ నటించగా, జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించారు. అలాగే, ఏఎన్నార్ పాత్రలో సుమంత్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి, ఇలా అనేక సీనియర్ నటుల పాత్రల్లో యువ నటీనటులు నటించారు. ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చారు.
 
ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. 'య‌మ‌గోల' చిత్రంలో ట చిల‌క కొట్టుడు కొడితే చిన్న‌దానా..' సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్‌ని ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో వాడుతున్నారు. ఎన్టీఆర్‌గా బాల‌కృష్ణ‌, జ‌య‌ప్ర‌ద‌గా హ‌న్సిక ఆ సాంగ్‌కి స్టెప్పులేయ‌నున్నారు. తాజాగా పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ అభిమానులని ఆక‌ట్టుకుంటుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments