Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నన్ను దోచుకుందువటే' షాక్‌లో సుధీర్ బాబు... అస‌లు ఏం జ‌రిగింది..?

న‌న్నుదోచుకుందువ‌టే సినిమాతో నిర్మాత‌గా మారాడు హీరో సుధీర్ బాబు. నూత‌న ద‌ర్శ‌కుడు ఆర్.ఎస్.నాయుడు తెర‌కెక్కించిన ఈ సినిమాకి రివ్యూ రైట‌ర్స్ చాలామంది మంచి రేటింగే ఇచ్చారు. సినీ ప్ర‌ముఖులు మ‌హేష్ బాబు, రాఘవేంద్ర‌రావు, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దిత‌రులు ఈ

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:25 IST)
న‌న్నుదోచుకుందువ‌టే సినిమాతో నిర్మాత‌గా మారాడు హీరో సుధీర్ బాబు. నూత‌న ద‌ర్శ‌కుడు ఆర్.ఎస్.నాయుడు తెర‌కెక్కించిన ఈ సినిమాకి రివ్యూ రైట‌ర్స్ చాలామంది మంచి రేటింగే ఇచ్చారు. సినీ ప్ర‌ముఖులు మ‌హేష్ బాబు, రాఘవేంద్ర‌రావు, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దిత‌రులు ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సినిమా కూడా చాలా స‌హ‌జంగా ఫ్యామిలీతో క‌లిసి చూసి ఆనందించేలా ఉంది. అయితే... క‌లెక్ష‌న్స్ మాత్రం రావ‌డం లేదు.
 
ఈ సినిమా 21న రిలీజైంది. ఆ రోజు హాలీడే. అయిన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. పోనీ.. శ‌నివారం నుంచి బాగుంటాయి అనుకుంటే... శ‌నివారం, ఆదివారం కూడా ఏమాత్రం పుంజుకోలేదు. చిత్రం ఏంటంటే... గ‌త వారం రిలీజైన నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు చిత్రానికి ఈవారం క‌లెక్ష‌న్స్ బాగున్నాయి. 
 
న‌న్నుదోచుకుందువ‌టే చిత్రానికి మెయిన్ థియేట‌ర్లో ఒక షోకి 20 వేలు వ‌స్తే.. శైల‌జారెడ్డి అల్లుడుకి 50 వేలు క‌లెక్ష‌న్స్ రావ‌డం విశేషం. వ‌చ్చే వారం నాగార్జున - నాని క‌లిసి దేవ‌దాస్ అంటూ వ‌చ్చేస్తున్నారు. ఇది చూసి సుధీర్ బాబు నిర్మించిన తొలి చిత్రం ఇలా అయ్యిందేంటి అని షాక్ అవుతున్నాడ‌ట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments