Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్

డీవీ
మంగళవారం, 2 జులై 2024 (12:44 IST)
Nandamuri Mokshajna
నందమూరి బాలక్రిష్ణ వారసుడు నందమూరి మోక్షజ్న సినిమా హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు? అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొనేది. బాలక్రిష్ణ కూడా పలు సందర్భాల్లో నటన ఇష్టంలేదని అంటున్నాడని చెప్పాడు. కొంతకాలానికి చదువు అయ్యాక చూద్దాం అన్నారు. ఇక నేటితో ఆ మాటలకు ఫుల్ స్టాప్ పడింది. ఎక్స్ (ట్విట్టర్)లో నందమూరి బాలక్రిష్ణ నే వారసుడు వస్తున్నాడు..అంటూ పోస్ట్ చేశాడు. కొద్ది సేపటికే నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్ చేస్తూ ఓ ఫొటోను కూడా పెట్టాడు.
 
గతంలో ఓ సారి ఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్న ఎంట్రీ వుంటే బాగుంటుందని తన మనసులోని మాటలను బాలక్రిష్ణ వ్యక్తం చేశాడు. అయితే ఆ కథను సింగీతం శ్రీనివాస్ రాసుకోవడానికి సమయం పడుతుందని చెప్పాడని కూడా వార్త వచ్చింది. 
 
చాలా కాలంగా మోక్ఝజ్న ఎంట్రీ కోసం కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం కుటుంబసభ్యులతోనూ సన్నిహితులతో పలు రకాల చర్చలు కూడా బాలక్రిష్ణ జరిపాడని తెలిసింది. ఎన్.టి.ఆర్. కు పరమ భక్తుడు అయిన వై.వి.ఎస్. చౌదరి కూడా తన చేతులమీదుగా ఎంట్రీ ఇప్పించాలని అనుకున్నా కుదరలేదని తెలిసింది. దాంతో కళ్యాణ్ రామ్ అన్న కొడుకు రామారావును నటుడిగా పరిచయం చేస్తున్నాడు. మరి మోక్ఝజ్న ఎంట్రీ ఏ సినిమాకో త్వరలో తెలియనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments