Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావమరిది పాడె మోసిన నారా చంద్రబాబు.. ప్రచార రథంతో యాత్ర

నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ పాడెను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, హరికృష్ణ బావమరిది అయిన నారా చంద్రబాబు నాయుడు మోసారు.

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (14:55 IST)
నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ పాడెను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, హరికృష్ణ బావమరిది అయిన నారా చంద్రబాబు నాయుడు మోసారు. గురువారం 2 గంటల సమయంలో మెహిదీపట్నంలోని స్వగృహం నుంచి హరికృష్ణ పార్థివదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు.
 
ఒకవైపు చంద్రబాబు, మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పాడెను మోశారు. పాడెకు ముందు ఎన్టీఆర్ కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు విషణ్ణవదనంతో ముందునడిచారు. ఈ అంతిమ యాత్రకు నందమూరి అభిమానులేకాకుండా స్థానికులు కూడా భారీ ఎత్తున తరలివచ్చి.. హరికృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. 
 
ఆ తర్వాత హరికృష్ణ భౌతికకాయాన్ని వైకుంఠ రథం (ప్రచార రథం) ఎక్కించారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగి మహాప్రస్థానం చేరుకోగానే ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments