Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావమరిది పాడె మోసిన నారా చంద్రబాబు.. ప్రచార రథంతో యాత్ర

నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ పాడెను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, హరికృష్ణ బావమరిది అయిన నారా చంద్రబాబు నాయుడు మోసారు.

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (14:55 IST)
నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ పాడెను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, హరికృష్ణ బావమరిది అయిన నారా చంద్రబాబు నాయుడు మోసారు. గురువారం 2 గంటల సమయంలో మెహిదీపట్నంలోని స్వగృహం నుంచి హరికృష్ణ పార్థివదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు.
 
ఒకవైపు చంద్రబాబు, మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పాడెను మోశారు. పాడెకు ముందు ఎన్టీఆర్ కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు విషణ్ణవదనంతో ముందునడిచారు. ఈ అంతిమ యాత్రకు నందమూరి అభిమానులేకాకుండా స్థానికులు కూడా భారీ ఎత్తున తరలివచ్చి.. హరికృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. 
 
ఆ తర్వాత హరికృష్ణ భౌతికకాయాన్ని వైకుంఠ రథం (ప్రచార రథం) ఎక్కించారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగి మహాప్రస్థానం చేరుకోగానే ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హమ్మయ్య.. పోసాని కృష్ణమురళికి ఊరట.. తక్షణ చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు

ఇద్దరమ్మాయిలతో ప్రేమ.. మతం మార్చుకున్న తొలి ప్రియురాలు.. పెళ్లి చేసుకోమంటే.. ఖాళీ సిరంజీలతో?

అతడు భర్త కాదు అమ్మాయిల బ్రోకర్, బోరుమన్న నెల్లూరు యువతి

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ పెంపుడు శునకం మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి (video)

RGV : రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు నుంచి ఉపశమనం - 6వారాల పాటు రిలీఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments