Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్వెన్షన్ సెంటర్ స్టే ఆర్డర్‌లో వుంది.. కూల్చివేత ఎలా సాధ్యం: నాగార్జున

సెల్వి
శనివారం, 24 ఆగస్టు 2024 (15:57 IST)
ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త అక్కినేని నాగార్జున తన ఎన్ కన్వెన్షన్‌ను చట్టవిరుద్ధంగా కూల్చివేయడాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది ఇప్పటికే ఉన్న స్టే ఆర్డర్‌లను, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను ఉల్లంఘించి నిర్వహించినట్లు పేర్కొన్నారు. నాగార్జున తన కన్వెన్షన్ సెంటర్‌పై తీసుకున్న చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 
 
తన భూమి చట్టబద్ధంగా పట్టా భూమిగా గుర్తించబడిందని, ఎటువంటి ట్యాంక్ ప్లాన్‌పై ఆక్రమణకు గురికాలేదని నాగార్జున నొక్కి చెప్పారు. భవనం ప్రైవేట్ స్థలంలో నిర్మించబడిందని, చట్టవిరుద్ధమని భావించే ముందస్తు కూల్చివేత నోటీసులకు వ్యతిరేకంగా స్టే ఆర్డర్ వుందని పునరుద్ఘాటించారు. 
 
కూల్చివేత చర్యలకు ముందు ఎటువంటి నోటీసు జారీ చేయకుండా, తప్పుడు సమాచారం ఆధారంగా కూల్చివేత అమలు చేయబడిందని నాగ్ అన్నారు. కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేతకు సంబంధించిన ఆర్డర్‌కు తాను వ్యక్తిగతంగా కట్టుబడి ఉండేవాడినని ఆయన వివరించారు. అధికారులు తీసుకున్న ఈ తప్పుడు చర్యలకు ప్రతిస్పందనగా న్యాయస్థానం నుండి తగిన చట్టపరమైన ఉపశమనం కోరుతున్నట్లు నాగార్జున అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments