Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌జిలీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌లు ఎవ‌రో తెలుసా..?

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (17:25 IST)
అక్కినేని నాగ చైత‌న్య - స‌మంత జంట‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పైన సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన మ‌జిలీ సాంగ్స్‌కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ రావ‌డంతో.. ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. ఎమోష‌న‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో చైత‌న్య క్రికెట‌ర్‌గా న‌టించారు. 
 
ఈ నెల 31న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్ధాయిలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ ఈవెంట్‌కు యువ స‌మ్రాట్ నాగార్జున - విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిథులుగా హాజ‌రు కానున్నారు. హైద‌రాబాద్ జెఆర్సీ ఫంక్ష‌న్ హాల్‌లో ఈ వేడుక జ‌ర‌ుగ‌నుంది. గోపీ సుంద‌ర్ సంగీతం అందించారు. త‌మ‌న్ రీ-రికార్డింగ్ అందించారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. చైత‌న్య ఎప్ప‌టి నుంచో భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. మ‌రి... ఆ భారీ విజ‌యాన్ని మ‌జిలీ అందిస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments