Webdunia - Bharat's app for daily news and videos

Install App

చై - శోభిత పెళ్లి పనులు ప్రారంభం... పసుపు దంచుతున్న ఫోటోలు వైరల్

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (16:49 IST)
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు ప్రారంభమైనట్టుగా తెలుస్తున్నాయి. వీరికి ఇటీవల నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. తాజాగా పెళ్లి పనులు ప్రారంభంకాగా, ఇందులో ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీరంతా పసుపు దంచుతున్న ఫోటోలను శోభిత తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. 
 
గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి అని క్యాప్షన్ పెట్టారు. ఎరుపు రంగ, గోధుమ వర్ణం పట్టు చీరలో శోభిత మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. పెళ్ళి ఎక్కడ, ఎపుడో చెప్పాలని అభిమానులు కోరుతున్నారు. కాగా, ఇటీవల తన కాబోయే భార్యతో నాగ చైతన్య దిగిన ఫోటోలను షేర్ చేసిన విషయం తెల్సిందే. వీరిద్దరూ ట్రెండీ లుక్స్‌లో ఉన్న ఆ ఫోటో కూడా క్షణాల్లో వైరల్ అయింది. 
 
కాగా, చై - శోభితలు ఎంతోకాలంగా మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టు నెల 8వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని హీరో నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకలో కుటుంబ పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments