Webdunia - Bharat's app for daily news and videos

Install App

చై - శోభిత పెళ్లి పనులు ప్రారంభం... పసుపు దంచుతున్న ఫోటోలు వైరల్

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (16:49 IST)
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు ప్రారంభమైనట్టుగా తెలుస్తున్నాయి. వీరికి ఇటీవల నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. తాజాగా పెళ్లి పనులు ప్రారంభంకాగా, ఇందులో ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీరంతా పసుపు దంచుతున్న ఫోటోలను శోభిత తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. 
 
గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి అని క్యాప్షన్ పెట్టారు. ఎరుపు రంగ, గోధుమ వర్ణం పట్టు చీరలో శోభిత మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. పెళ్ళి ఎక్కడ, ఎపుడో చెప్పాలని అభిమానులు కోరుతున్నారు. కాగా, ఇటీవల తన కాబోయే భార్యతో నాగ చైతన్య దిగిన ఫోటోలను షేర్ చేసిన విషయం తెల్సిందే. వీరిద్దరూ ట్రెండీ లుక్స్‌లో ఉన్న ఆ ఫోటో కూడా క్షణాల్లో వైరల్ అయింది. 
 
కాగా, చై - శోభితలు ఎంతోకాలంగా మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టు నెల 8వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని హీరో నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకలో కుటుంబ పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments