Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఉప్పెన" దర్శకుడుకి మైత్రీ మూవీస్ ఆఫర్... రెండింటిలో ఏది కావాలో చెప్పాలంటూ...

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (13:18 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో లెక్కల మాస్టారుగా గుర్తింపు పొందిన దర్శకుడు కె.సుకుమార్. ఈయన వద్ద శిష్యరికం చేసిన అనేక మంది యువకులు దర్శకులుగా మారి సత్తా చాటుతున్నారు. ఈ కోవలోనే ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా ఒకరు. ఈయన తొలి చిత్రం "ఉప్పెన"తోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మేకర్స్ సంస్థ నిర్మించింది. 
 
ఉప్పెన చిత్రంతోనే దర్శకుడు బుచ్చిబాబు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. అంతేకాకుండా, మైత్రీ మూవీ మేక‌ర్స్ తీసిన చిత్రాల్లో "డియ‌ర్ కామ్రేడ్"‌, "స‌వ్య‌సాచి" చిత్రాలు మిగిల్చిన నష్టాలను ఈ ఉప్పెన భర్తీ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సంతోష‌క‌ర సంద‌ర్భంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ డైరెక్ట‌ర్ బుచ్చిబాబుకు ఓ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.
 
తాజా స‌మాచారం స‌ద‌రు సంస్థ బుచ్చిబాబుకు ఖ‌రీదైన‌ కారు, ఇల్లు, రెండింటిలో ఏదో ఒక ఆఫ‌ర్‌ను ఎంచుకోవాల‌ని సూచించింద‌ట‌. తొలి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఇండ‌స్ట్రీకి అందించిన బుచ్చిబాబుకు ఈ రెండు గిఫ్టులు క‌లిపి ఇచ్చినా త‌ప్పేమి లేద‌ని ప‌లువురు అభిప్రాయ‌డుతున్నారు. కాగా, గ‌తంలో "ఛ‌లో" సినిమాకు వెంకీ కుడుముల‌, "ప్ర‌తీ రోజూ పండ‌గే" చిత్రానికి దర్శకుడు మారుతి కార్లు బ‌హుమ‌తిగా అందుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments