Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సిరివెన్నెల' సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించింది : ఇళయరాజా

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (13:02 IST)
తెలుగు సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంపై సంగీత మేథావి ఇళయరాజా స్పందించారు. సిరివెన్నెల మృతిపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతికలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన ఇంత త్వరగా శివైఖ్యం చెందడం చాలా బాధగా ఉందన్నారు. సిరివెన్నెల జీవించినంత కాలం పాట కోసం జీవించారని, బతికినంత కాలం పాటలే రాశారని, ఆయనకు ఈశ్వరుడు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే అంశంపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
వేటూరి సుందరరామమూర్తి అసిస్టెంట్‌గా చేరిన సిరివెన్నెల అనతి కాలంలోనే శిఖర స్థాయికి చేరుకున్నారని కొనియాడారు. తమ ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు జీవం పోసుకున్నాయన్నారు. సిరివెన్నెల పాటల పదముద్రలు తన హార్మొనియం మెట్లపై నాట్యం చేశాయని అన్నారు. సినిమా పాటల్లో సైతం కవితాత్మని, కళాత్మకతని అందించి తనదైన ముద్రతతో అర్థవంతమైన పాటలు అందించారన్నారు. 
 
ముఖ్యంగా, సిరివెన్నెల సాహిత్యం తనతో ఆనంద తాండవం చేయించిందని ఇళయరాజా అన్నారు. వేటూరు తనకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే సీతారామశాస్త్రి తనకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచారని ఇళయరాజా కొనియాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబై నగరం మునిగిపోయింది .. ఒక్క మే నెలలోనే 107 యేళ్ల వర్షపాత రికార్డు కనుమరుగు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఏకే47 రైఫిల్స్‌తో సెక్యూరిటీ!!

పోలీసులకు లంచమిచ్చి భార్యలు - ప్రియురాళ్లతో ఖైదీల రాసలీలు!

జ్యోతి మల్హోత్రాకు జ్యూడిషియల్ కస్టడీ పొడగింపు...

యేడాది పొడవు ఎన్నికలు ప్రసవంతో సమానం : డాక్టర్ తమిళిసై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments