Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సిరివెన్నెల' సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించింది : ఇళయరాజా

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (13:02 IST)
తెలుగు సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంపై సంగీత మేథావి ఇళయరాజా స్పందించారు. సిరివెన్నెల మృతిపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతికలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన ఇంత త్వరగా శివైఖ్యం చెందడం చాలా బాధగా ఉందన్నారు. సిరివెన్నెల జీవించినంత కాలం పాట కోసం జీవించారని, బతికినంత కాలం పాటలే రాశారని, ఆయనకు ఈశ్వరుడు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే అంశంపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
వేటూరి సుందరరామమూర్తి అసిస్టెంట్‌గా చేరిన సిరివెన్నెల అనతి కాలంలోనే శిఖర స్థాయికి చేరుకున్నారని కొనియాడారు. తమ ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు జీవం పోసుకున్నాయన్నారు. సిరివెన్నెల పాటల పదముద్రలు తన హార్మొనియం మెట్లపై నాట్యం చేశాయని అన్నారు. సినిమా పాటల్లో సైతం కవితాత్మని, కళాత్మకతని అందించి తనదైన ముద్రతతో అర్థవంతమైన పాటలు అందించారన్నారు. 
 
ముఖ్యంగా, సిరివెన్నెల సాహిత్యం తనతో ఆనంద తాండవం చేయించిందని ఇళయరాజా అన్నారు. వేటూరు తనకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే సీతారామశాస్త్రి తనకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచారని ఇళయరాజా కొనియాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments