Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియాను వేధించొద్దు ... వాహనాలను వెంబడించడం నేరం : మీడియాకు ఖాకీల వార్నింగ్

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (15:29 IST)
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయి దాదాపు నెల రోజుల పాటు జైలు జీవితం గడిన బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి మాదకద్రవ్యాల కేసులో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె ఏ క్షణమైనా జైలు నుంచి విడుదలకావొచ్చు. అయితే, ఈ కేసులో రియా నుంచి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన జాతీయ మీడియా మరోసారి ఆమె వెంటపడే అవకాశం ఉండడంతో మీడియాకు ముంబై పోలీసులు గట్టి హెచ్చరికలే చేశారు. 
 
ఏ క్షణమైనా జైలు విడుదలయ్యే రియా చక్రవర్తిని వేధించవద్దు.. వెంబడించవద్దు అంటూ కోరారు. పైగా, వాహనాలను వెంబడించడం నేరమని పోలీసులు అంటున్నారు. ఆమెపై సంబంధం లేని ప్రశ్నలు అడగవద్దని చెప్పారు. సెలబ్రిటీలను, వారి న్యాయవాదులను జర్నలిస్టులు ఇంటర్వ్యూలు చేయాలనే ఉద్దేశంతో వారి వాహనాలను వెంబడించొద్దని సూచించారు. ఇలా వాహనాలను వెంబడించడం నేరమని పోలీసులు స్పష్టం చేశారు.
 
పైగా, వాహనాలను వెంబడించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. వాహనాలను వెంబడిస్తే జర్నలిస్టుల జీవితాలతోపాటు, రోడ్ల మీద నడుస్తున్న సాధారణ ప్రజలకు ప్రమాదమని చెప్పారు. సెలబ్రిటీల వాహనాలను ఇతర వాహనాల్లో వెంబడించే డ్రైవర్‌తో పాటు వారిని ప్రేరేపించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ముంబై మహానగర పోలీసులు హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments