Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బున్నవాళ్లకే మంచి దర్శనమా?.. టీటీడీ తీరుపై మోహనబాబు ఫైర్‌

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై సినీ నటుడు మోహన్ బాబు మండిపడ్డారు. డబ్బున్న వాళ్లకే టీటీడీ అధికారులు తిరుమలలో మంచి దర్శనం కల్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (05:38 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై సినీ నటుడు మోహన్ బాబు మండిపడ్డారు. డబ్బున్న వాళ్లకే టీటీడీ అధికారులు తిరుమలలో మంచి దర్శనం కల్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆదివారం వేకువజామున ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ హయాంలో ఉన్నట్లుగా తితిదే అధికారుల పరిపాలన ఇప్పుడు లేదన్నారు. 
 
ఆలయ ప్రవేశం చేసే ముందు ధ్వజస్తంభాన్ని తాకడం సంప్రదాయమని, అయితే టీటీడీ కొంతమందికే ఆ అవకాశాన్ని కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ధ్వజస్తంభం తాకాలని ఏ రాజ్యాంగంలో ఉందని ప్రశ్నించారు. 
 
శ్రీవారి ఆలయానికి వచ్చిన ప్రతి అధికారీ (ఈవో, జేఈవో) తనకిష్టమైన విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. గుడికి వచ్చినప్పుడంతా ఇలాంటి ఆవేదనే తనకు కలుగుతోందన్నారు. మంచీచెడు దేవుడు చూస్తుంటాడని, తన క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత స్వామిపైనే ఉందని వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments