Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాను కలిసిన బండ్లగణేష్.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనలేదే..!

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (21:37 IST)
Roja_Bandla ganesh
సీనియర్ నటి రోజా, నటుడు, నిర్మాత బండ్లగణేష్ ఓ ప్రైవేట్ ఫంక్షన్‌‌లో కలిశారట. ఈ మేరకు ఫోజిచ్చిన ఓ ఫోటోను బండ్లగణేష్ నెట్టింట పోస్టు చేశాడు. వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు.. బండ్ల గణేష్‌కు కొంత కాలం క్రితం ఓ న్యూస్ చానెల్ లైవ్ డిబేట్‌లో గొడవ జరిగింది. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన రోజాపై.. బండ్ల గణేష్ బూతులతో విరుచుకుపడ్డారు. రోజా కూడా తన నోటికి పనిచెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య నాడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ ఇద్దరికీ మాటలు లేవు. మాటాడుకోవడాలు లేవ్ అన్నట్టుగా అయిపోయింది.
 
అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఫంక్షన్‌కు వీరిద్దరు హాజరైయ్యారట. దాంతో వీరిద్దరూ పాత పగలన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుతూ ఫొటోకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్.. 'చాలా కాలం తర్వాత రోజా గారిని కలిశానని.. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని.. ఆమెకు ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేయడం విశేషంగా మారింది. ఈ ఫోటోను చూసినవారంతా సినీ ఇండస్ట్రీ అయినా..రాజకీయాలలోనైనా శాశ్వత మిత్రులు..శాశ్వత శత్రువులు ఉండరనే సామెత ఉండనే ఉందని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments