Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాను కలిసిన బండ్లగణేష్.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనలేదే..!

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (21:37 IST)
Roja_Bandla ganesh
సీనియర్ నటి రోజా, నటుడు, నిర్మాత బండ్లగణేష్ ఓ ప్రైవేట్ ఫంక్షన్‌‌లో కలిశారట. ఈ మేరకు ఫోజిచ్చిన ఓ ఫోటోను బండ్లగణేష్ నెట్టింట పోస్టు చేశాడు. వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు.. బండ్ల గణేష్‌కు కొంత కాలం క్రితం ఓ న్యూస్ చానెల్ లైవ్ డిబేట్‌లో గొడవ జరిగింది. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన రోజాపై.. బండ్ల గణేష్ బూతులతో విరుచుకుపడ్డారు. రోజా కూడా తన నోటికి పనిచెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య నాడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ ఇద్దరికీ మాటలు లేవు. మాటాడుకోవడాలు లేవ్ అన్నట్టుగా అయిపోయింది.
 
అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఫంక్షన్‌కు వీరిద్దరు హాజరైయ్యారట. దాంతో వీరిద్దరూ పాత పగలన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుతూ ఫొటోకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్.. 'చాలా కాలం తర్వాత రోజా గారిని కలిశానని.. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని.. ఆమెకు ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేయడం విశేషంగా మారింది. ఈ ఫోటోను చూసినవారంతా సినీ ఇండస్ట్రీ అయినా..రాజకీయాలలోనైనా శాశ్వత మిత్రులు..శాశ్వత శత్రువులు ఉండరనే సామెత ఉండనే ఉందని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments