Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి చేతుల మీదుగా ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (13:01 IST)
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరుగనుంది. ఇందుకోసం ఆయన ఈ నెల ఆరో తేదీన తాడేపల్లికిరానున్నారు. ఈ విషయాన్ని ఎస్‌వీఆర్‌ సేవాసంఘం అధ్యక్షుడు భోగిరెడ్డి రాము తెలిపారు. 
 
గురువారం స్థానిక కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో రాము మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణకు చిరంజీవి అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. 
 
మౌలిక వసతులు, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చిరంజీవి అభిమానులు సహకారం అందించాలన్నారు. సుమారు 40 వేల మంది కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్‌ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. 
 
6వ తేదీన మెగాస్టార్‌ చిరంజీవి హైదారాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం వస్తారన్నారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఐ.నాగు, జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్‌, బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, టీడీపీ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, కాపుసంఘం నాయకులు వడ్డీ రఘురాం, మాకా శ్రీనివాసరావు, అడపాల నారాయణ, మారిశెట్టి ఆజయ్‌, ఎస్వీఆర్‌ సేవాసంఘం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD: మే 23-27 వరకు ఐదు రోజుల పాటు వర్షాలు- 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

అత్యాచారం కేసులో జైలు నుంచి విడుదలై సంబరాలు చేసుకున్న నిందితులు!!

Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

మాకు నీటిని ఆపితే.... మేము మీ శ్వాసను ఆపేస్తాం : భారత్‌కు పాకిస్థాన్ హెచ్చరిక

భీమవరం బుల్లోడు బ్రిటన్ ఉప మేయర్ అయ్యాడు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments