Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి చేతుల మీదుగా ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (13:01 IST)
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరుగనుంది. ఇందుకోసం ఆయన ఈ నెల ఆరో తేదీన తాడేపల్లికిరానున్నారు. ఈ విషయాన్ని ఎస్‌వీఆర్‌ సేవాసంఘం అధ్యక్షుడు భోగిరెడ్డి రాము తెలిపారు. 
 
గురువారం స్థానిక కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో రాము మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణకు చిరంజీవి అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. 
 
మౌలిక వసతులు, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చిరంజీవి అభిమానులు సహకారం అందించాలన్నారు. సుమారు 40 వేల మంది కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్‌ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. 
 
6వ తేదీన మెగాస్టార్‌ చిరంజీవి హైదారాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం వస్తారన్నారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఐ.నాగు, జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్‌, బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, టీడీపీ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, కాపుసంఘం నాయకులు వడ్డీ రఘురాం, మాకా శ్రీనివాసరావు, అడపాల నారాయణ, మారిశెట్టి ఆజయ్‌, ఎస్వీఆర్‌ సేవాసంఘం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments