సినిమాను పెళ్లి చేసుకుని సినిమాతో సంసారం చేస్తున్న యోగి...

Webdunia
బుధవారం, 22 మే 2019 (10:12 IST)
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి తాజా చిత్రం "మార్కెట్‌లో ప్రజాస్వామ్యం". ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నారాయణమూర్తి గురించి అద్భుతమైన ప్రసంగం చేశారు. 
 
ఆర్. నారాయణ మూర్తి ఒక సినిమా పిచ్చోడన్నారు. ఆయన సినిమాను పెళ్లి చేసుకుని, సినిమాతో సంసారం చేస్తూ, సినిమాలనే తన పిల్లలుగా భావిస్తున్న సినిమా యోగి అని కొనియాడారు. ఆర్ నారాయణ మూర్తితో తనకు నాలుగు దశబాద్దాల అనుబంధం ఉందన్నారు. తామిద్దరం ప్రాణం ఖరీదు చిత్రంలో నటించామని గుర్తుచేశారు. ఆర్. నారాయణ మూర్తి ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు తనను ఆహ్వానించడం ఆశ్చర్యానికి లోనయ్యాయని చెప్పారు. ఆయన ఫంక్షన్‌కు రావడం తన కుటుంబ సభ్యుడు కార్యక్రమానికి వచ్చినట్టుగా ఉందని చిరంజీవి ఉందన్నారు. 
 
ఇకపోతే, మెగాస్టార్ చిరంజీవితో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి పకోడీలు తినిపించారు. ఈ అరుదైన దృశ్యం ఈ చిత్రం ఆడియో లాంచ్‌లో జరిగింది. సాధారణంగా చిరంజీవి ఏ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లినా ఎలాంటి తినుబండారాలు తీసుకోకుండా వెళ్లిపోతారు. ఈసారి కూడా అలాగే జరుగుతుందని అక్కడున్న వారు భావించారు. 
 
కానీ, అందరూ ఆశ్చర్యపోయేలా ప్లేట్‌లో పకోడీలు పెట్టి.. చిరంజీవి చేతికి ఇచ్చి అవి తినేవరకూ ఆర్. నారాయణ మూర్తి అక్కడే ఉన్నారు. ఎవరూ ఊహించని ఈ పనిని మెగాస్టార్‌తో పీపుల్స్ స్టార్ చేయించడంతో ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతైంది. ప్రస్తుతం చిరంజీవి పకోడీలు తింటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments