Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్మనిచ్చిన ఆ మహనీయుడుని స్మరించుకుంటూ...

ఠాగూర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (17:03 IST)
మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు వర్థింతిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు వర్థంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ నివాసంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ పూజలో తల్లి అంజనా దేవి, సోదరుడు నాగబాబు దంపతులు, చిరంజీవి దంపతులు పాల్గొన్నారు. వీరందరితో కలిసి చిరంజీవి తన తండ్రి చిత్రపటానికి పూల మాల వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం తాలూకు ఫోటోలు,  వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. "జన్మనిచ్చిన ఆ మహనీయుడిని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
 
మరోవైపు, చిరంజీవి కొత్త చిత్రాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో సినిమా చేయనున్నారు. ఇటీవలే అధికారికంగా ఈ ప్రాజెక్టుపై ప్రకటన కూడా వచ్చింది. నేచురలో స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సీనియర్ దర్శకులతో కాకుండా యువ దర్శకులతో చిరంజీవి కొత్త కొత్త చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments